డిపిఎస్-ఎంఐఎస్ స్టూడెంట్స్తో సానియా మీర్జా
- February 23, 2016
ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డిపిఎస్ మోడర్న్ ఇండియన్ స్కూల్ (ఎంఐఎస్) స్టూడెంట్స్తో మమేకమయ్యారు. ఈ సందర్భంగా, క్రీడల పట్ల చిన్నప్పటినుంచే ఆసక్తి పెంచుకోవాలని, తల్లిదండ్రులు, సమాజం, ప్రభుత్వాలు పిల్లల్లోని క్రీడల పట్ల ఆసక్తిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. క్రీడల్ని ప్రొఫెషన్గా ఎంచుకోవాలనుకునేవారు, విద్యలో కూడా ముందుండేందుకు ప్రయత్నించాలని అన్నారు సానియా మీర్జా. 'నేను చదువుకున్న స్కూలు నాకు చాలా నేర్పించింది. తల్లిదండ్రులు, టీచర్లు, స్నేహితులు అందించిన ప్రోత్సాహమే ఇప్పుడు నేఇలా ఉండటానికి కారణం' అని సానియా మీర్జా చెప్పింది. కతార్ టెన్నిస్ ఫౌండేషన్తో కలిసి డిపిఎస్-ఎంఐఎస్ సానియా మీర్జాతో విద్యార్థుల కలయికకు ఏర్పాట్లు చేసింది. టెన్నిస్ తర్వాత క్రికెట్ అంటే ఇష్టమనీ, అందుకే క్రికెటర్ని పెళ్లాడానని సాయినా వెల్లడించింది. ఖతార్ టోటల్ ఓపెన్లో సానియా మీర్జా స్విస్ లెజెండ్ మార్టినా హింగిస్తో కలిసి డబుల్స్ ఆడనుంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







