ఆసుపత్రి నుండి శశికళ డిశ్చార్జ్: మరికొన్ని రోజులు బెంగుళూరులోనే..
- January 31, 2021
బెంగుళూరు: ఎఐడీఎంకె మాజీ నేత శశికళ బెంగుళూరులోని ఆసుపత్రి నుండి ఆదివారం నాడు డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో జైలు నుండి ఆసుపత్రిలో చేరిన శశికళ ఇవాళ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.
బెంగుళూరు నుండి విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్న సమయంలోనే ఆమె జైలు నుండి విడుదలయ్యారు. ఆసుపత్రిలోనే ఆమె విడుదలకు సంబంధించిన ప్రక్రియను జైలు అధికారులు పూర్తి చేశారు.
ఆమె ఆరోగ్యంగా ఉన్నందున ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆసుపత్రి వర్గాలు శనివారం నాడు ప్రకటించారు. ఈ నెల 21వ తేదీన కరోనాతో ఆమె ఆసుపత్రిలో చేరారు. అక్రమాస్తుల కేసులో శశికళను ఐటీ అధికారులు అరెస్ట్ చేశారు. రూ. 1600 కోట్లను ఐటీ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. మరో పది రోజుల పాటు బెంగుళూరులోనే శశికళ ఉండే అవకాశం ఉందని సమాచారం.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







