దుబాయ్ బస్స్టాప్లో ఉచిత వైఫై
- February 25, 2016
జెమైరాలో తొలి స్మార్ట్ ఎయిర్ కండిషన్డ్ షెల్టర్ని బస్సు ప్రయాణీకుల కోసం అందుబాటులోకి తెచ్చారు. ఈ బస్ షెల్టర్ని డైరెక్టర్ జనరల్, ఛైర్మన్ ఆఫ్ది బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మట్టర్ అల్ తాయెర్ ప్రారంభించారు. దుబాయ్లోని 15 డిస్ట్రిక్ట్స్లో నిర్మించనున్న 100 స్మార్ట్ షెల్టర్స్లో ఇది మొదటిది. స్మార్ట్ షెల్టర్స్లో అత్యాధునిక సౌకర్యాలు ప్రయాణీకులకు నఅందుబాటులో ఉంటాయి. 'డు' సంస్థ ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పించింది. ఎన్ఓఎల్ టాప్ అప్ కార్డ్స్, లోకల్, ఇంటర్నేషనల్ నెట్వర్క్ కోసం టాప్ అప్ మొబైల్ ఫోన్స్, పబ్లిక్ మరియు ప్రైవేట్ ఎంటైటిల్స్కి సంబంధఙంచిన బిల్లుల చెల్లింపు, మొబైల్ ఫోన్ రీఛార్జింగ్, స్మార్ట్ కియోస్క్, మీడియా మరియు అడ్వర్టయిజింగ్ స్క్రీన్స్, ఆర్టీఏ సర్వీసులకు సంబంధించిన సమాచార ప్రదర్శన, స్నాక్స్ మరియు రిఫ్రెష్మెంట్స్ లభించే మినీ మార్ట్ ఇందులో ఏర్పాటయ్యాయి. ఫిబ్రవరి పూర్తయ్యేనాటికి 25 స్మార్ట్ షెల్టర్స్ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. మిగిలిన 75 షెల్టర్స్ మార్చ్ నెలాఖరుకు పూర్తి చేస్తారు. పలు అంశాల్ని పరిగణనలోకి తీసుకుని స్మార్ట్ షెల్టర్స్ కోసం బస్ స్టాప్స్ని ఎంపిక చేశారు. షేక్ జాయెద్ రోడ్, అల్ వస్ల్, జుమైరా, డీరా, ఉమ్ అల్ రోమూల్, అల్ కోజ్, అల్ రషిదియా, అల్ ఖాసైస్, అల్ అవిర్, అల్ నహదా, అల్ సత్వా, అల్ కరమా, అల్ రస్, అల్ గరహౌడ్, అల్ జుఫిలియా తదితర ప్రాంతాల్లో ఈ స్మార్ట్ బస్ షెల్టర్స్ని ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







