రాత పరీక్ష లేకుండా ఇండియన్ రైల్వేలో భారీగా ఉద్యోగాలు.!
- February 19, 2021
వరుసగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ఇండియన్ రైల్వేస్ తాజాగా మరోసారి భారీ సంఖ్యలో నియామకాలను చేపట్టింది. మొత్తం 2500లకు పైగా అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ రైల్వేలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నియామకాలను చేపట్టారు. అయితే ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు లేకుండానే మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చ్ 5 వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఖాళీల వివరాలు..
ముంబాయిలోని వివిధ విభాగాల్లో 1767 పోస్టులను భర్తీ చేస్తున్నారు. భూసావల్ రైల్వే డివిజన్ పరిధిలో 420 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పూణేలో 152, షోలాపూర్ లో 79 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
అర్హతల వివరాలు..
అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో టెన్త్ అర్హత సాధించి ఉండాలి. NCVT సర్టిఫికేట్ ను పొంది ఉండాలి. అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఐటీఐ, టెన్త్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
అధికారిక వెబ్సైట్:https://www.rrccr.com/
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









