'అటాక్' అంటున్న వర్మ..
- May 30, 2015
రాంగోపాల్ వర్మ ఈ మధ్య చాలా బిజీబిజీగా ఉంటున్నారు. సినిమాల మీద సినిమాలు తెగ తీసేస్తూ ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటీవలే '365 డేస్' సినిమాను విడుదల చేసిన ఆయన.. ఇప్పుడు మంచు మనోజ్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ లాంటి అగ్రశ్రేణి తారాగణంతో 'ఎటాక్' అనే కొత్త సినిమా తీస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వర్మే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. సినిమా మోషన్ పోస్టర్ ను యూట్యూబ్ ద్వారా పరిచయం చేశారు. ఇందులో మళ్లీ ప్రకాష్ రాజ్ 'అంతఃపురం' లాంటి పాత్రలో కనిపించేలా ఉన్నారు. మనోజ్, జగపతి బాబు కూడా పూర్తి ఫైర్ చూపిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను ఆదివారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తానని కూడా రాంగోపాల్ వర్మ చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







