'అటాక్' అంటున్న వర్మ..
- May 30, 2015
రాంగోపాల్ వర్మ ఈ మధ్య చాలా బిజీబిజీగా ఉంటున్నారు. సినిమాల మీద సినిమాలు తెగ తీసేస్తూ ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటీవలే '365 డేస్' సినిమాను విడుదల చేసిన ఆయన.. ఇప్పుడు మంచు మనోజ్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ లాంటి అగ్రశ్రేణి తారాగణంతో 'ఎటాక్' అనే కొత్త సినిమా తీస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వర్మే తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. సినిమా మోషన్ పోస్టర్ ను యూట్యూబ్ ద్వారా పరిచయం చేశారు. ఇందులో మళ్లీ ప్రకాష్ రాజ్ 'అంతఃపురం' లాంటి పాత్రలో కనిపించేలా ఉన్నారు. మనోజ్, జగపతి బాబు కూడా పూర్తి ఫైర్ చూపిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను ఆదివారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తానని కూడా రాంగోపాల్ వర్మ చెప్పారు.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









