టీడీపీ కువైట్ మహానాడులో కోడెల శివప్రసాద్
- May 30, 2015
‘తెలుగుదేశం పార్టీ - కువైట్’ ఆధ్వర్యంలో మహానాడు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కువైట్లోని తెలుగుదేశం పార్టీ అభిమానులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్, టీడీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ ‘టీడీపీ కువైట్ మహానాడు’ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శుక్రవారం మే 29వ తేదీ సాయంత్రం 4 గంటలనుండి కువైట్ బాయ్స్ స్కవుట్ అసోసియేషన్, హవల్లీ సెంటర్ పాయింట్ ఎదురుగా మహానాడు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నేపథ్య గాయకులు, వారి బృందం సంగీత విభావరి నిర్వహించింది. ఆహూతుల్ని ఈ సంగీత విభావరి అలరించింది. కార్యక్రమం అనంతరం రుచికరమైన విందును ఆస్వాదించారు ‘మహానాడు’లో పాల్గొన్నవారు. మా గల్ఫ్ డాట్ కామ్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







