టీడీపీ కువైట్ మహానాడులో కోడెల శివప్రసాద్
- May 30, 2015
‘తెలుగుదేశం పార్టీ - కువైట్’ ఆధ్వర్యంలో మహానాడు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కువైట్లోని తెలుగుదేశం పార్టీ అభిమానులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్, టీడీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ ‘టీడీపీ కువైట్ మహానాడు’ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శుక్రవారం మే 29వ తేదీ సాయంత్రం 4 గంటలనుండి కువైట్ బాయ్స్ స్కవుట్ అసోసియేషన్, హవల్లీ సెంటర్ పాయింట్ ఎదురుగా మహానాడు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నేపథ్య గాయకులు, వారి బృందం సంగీత విభావరి నిర్వహించింది. ఆహూతుల్ని ఈ సంగీత విభావరి అలరించింది. కార్యక్రమం అనంతరం రుచికరమైన విందును ఆస్వాదించారు ‘మహానాడు’లో పాల్గొన్నవారు. మా గల్ఫ్ డాట్ కామ్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరించింది.
తాజా వార్తలు
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!









