మార్చి 12న ఎయిర్ పోర్ట్ రోడ్డు 55 మూసివేత
- March 09, 2021
కువైట్: ఈ నెల 12న(శుక్రవారం) తెల్లవారుజాము నుంచే ఎయిర్ పోర్టుకు వెళ్లే రోడ్డు నెంబర్ 55ను మూసివేయనున్నారు. పాదాచారులు రోడ్డు దాటేందుకు వీలుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయనున్నారు. క్రౌన్ ప్లాజా హోటల్ సమీపంలోని ఫర్వానియా బ్లాక్ 6 నుంచి ఖైతాన్ ఎరియాలోని బ్లాక్ 2 వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు జరగున్నాయి. దీంతో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఎయిర్ పోర్ట్ రోడ్డు 55లో రెండు వైపులా వాహనాలకు అనుమతి ఉండదు. ఎయిర్ పోర్ట్ రోడ్డు 55 మీదుగా వెళ్లాల్సిన వాహనాలను సిక్త్స్ రింగ్ రోడ్డుకు మళ్లించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







