ఆ 13 దేశాల నుంచి వచ్చేవారికి పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ అవసరం లేదన్న ఖతార్ ఎయిర్ వేస్
- March 24, 2021
దోహా: ఖతార్ ఎయిర్ వేస్, ఆర్టి - పిసిఆర్ టెస్ట్ విషయమై కీలక ప్రకటన చేసింది. 13 దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్ తీసుకురావాల్సిన అవసరం లేదనీ, ఈ నిర్ణయం మార్చి 16 నుంచి అందుబాటులోకి వచ్చిందని పేర్కొంది. గతంలో ఖతార్ ఎయిర్ వేస్ తమ ప్రయాణీకులందరికీ పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది. కాగా, ప్రభుత్వ పరంగా తీసుకునే కీలక నిర్ణయాలు అప్పటికప్పుడు అమల్లోకి వస్తాయనీ, వాటి వివరాల్ని తమ వెబ్సైట్లో పేర్కొంటామని తెలిపింది ఖతార్ ఎయిర్ వేస్. అర్మేనియా, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇండియా, ఇరాన్, ఇరాక్, నేపాల్, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, రష్యా, శ్రీలంక, టాంజానియా దేశాలు ఆ 13 దేశాల జాబితాలో వున్నాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ
- సౌదీ అరేబియాలో బార్డర్ దాటుతూ..1,454 మంది అరెస్టు..!!
- ద్వైపాక్షిక సంబంధాలపై బహ్రెయిన్, కువైట్ చర్చలు..!!
- ఏక్ పెడ్ మా కే నామ్..కువైట్ లో మొక్కలు నాటిన భారత రాయబారి..!!
- అల్-సఫ్లియా సమీపంలో నౌకల వినియోగంపై సర్క్యులర్ జారీ..!!
- ఒమన్ కార్మిక చట్టం ప్రకారం ఓవర్టైమ్ కు ఉద్యోగి అంగీకారం తప్పనిసరా?
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్









