ఆ 13 దేశాల నుంచి వచ్చేవారికి పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ అవసరం లేదన్న ఖతార్ ఎయిర్ వేస్
- March 24, 2021
దోహా: ఖతార్ ఎయిర్ వేస్, ఆర్టి - పిసిఆర్ టెస్ట్ విషయమై కీలక ప్రకటన చేసింది. 13 దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్ తీసుకురావాల్సిన అవసరం లేదనీ, ఈ నిర్ణయం మార్చి 16 నుంచి అందుబాటులోకి వచ్చిందని పేర్కొంది. గతంలో ఖతార్ ఎయిర్ వేస్ తమ ప్రయాణీకులందరికీ పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది. కాగా, ప్రభుత్వ పరంగా తీసుకునే కీలక నిర్ణయాలు అప్పటికప్పుడు అమల్లోకి వస్తాయనీ, వాటి వివరాల్ని తమ వెబ్సైట్లో పేర్కొంటామని తెలిపింది ఖతార్ ఎయిర్ వేస్. అర్మేనియా, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇండియా, ఇరాన్, ఇరాక్, నేపాల్, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, రష్యా, శ్రీలంక, టాంజానియా దేశాలు ఆ 13 దేశాల జాబితాలో వున్నాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- కొత్త సాఫ్ట్ వేర్తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ
- ఫుట్బాల్ మ్యాచ్లో తూటాల వర్షం..11 మంది మృతి
- టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్ విడుదల..
- అమెజాన్: 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్
- భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!







