కొత్త సాఫ్ట్ వేర్తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ
- January 27, 2026
హైదరాబాద్: భాగ్యనగర వాసులకు పౌర సేవలను మరింత చేరువ చేసే దిశగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కీలక అడుగు వేసింది. నగర విస్తరణ, పరిపాలన సౌలభ్యం కోసం ఇటీవల చేపట్టిన సంస్కరణలకు అనుగుణంగా (TG) జనన, మరణాల నమోదు వ్యవస్థను ఆధునీకరించింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో రూపొందించిన సరికొత్త సాఫ్ట్వేర్ అప్లికేషన్ను అధికారులు అధికారికంగా ప్రారంభించారు.
భారీ స్థాయిలో జరిగిన భౌగోళిక మార్పుల వల్ల పాత నమోదు వ్యవస్థలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తుగా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. (TG) నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్లను కొత్తగా ఏర్పడిన 300 వార్డులు మరియు 60 సర్కిళ్లతో అనుసంధానించారు. దీనివల్ల ఏ ప్రాంతంలో జననం లేదా మరణం సంభవించినా అది తక్షణమే సంబంధిత వార్డు పరిధిలోకి ఆటోమేటిక్గా నమోదవుతుంది. గతంలో ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కొత్త వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.
జననం లేదా మరణం సంభవించిన 21 రోజులలోపు ఆసుపత్రి యాజమాన్యం లేదా కుటుంబ సభ్యులు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ గడువు దాటితే.. నిర్ణీత జరిమానాతో పాటు రెవెన్యూ అధికారుల అనుమతి అవసరమవుతుంది. కొత్త సాఫ్ట్వేర్ రాకతో పేరు , అడ్రస్లో మార్పులు కూడా గతంలో కంటే త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







