భారత్ లో కరోనా కేసుల వివరాలు

- March 26, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్ లో క‌రోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి, గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్ లో కొత్త‌గా 59,118 కేసులు న‌మోద‌య్యాయి.దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 1,18,46,652కి చేరింది.ఇందులో 1,12,64,637 మంది కోలుకోగా, 4,21,066 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటే, గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్ లో 257 మంది క‌రోనాతో మృతి చెందారు.దీంతో భారత్లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మ‌ర‌ణాల సంఖ్య 1,60,949 కి చేరింది.గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్లో 32,987 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  కోలుకిని డిశ్చార్జ్ అయిన కేసుల కంటే పాజీటీవ్ కేసులు డ‌బుల్ గా ఉండ‌టం విశేషం.భారత్ లో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 5,55,04,440 మందికి క‌రోనా టీకా అందించిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com