భారత 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..మార్చి 31 నుంచి ప్రారంభం
- March 26, 2021
కువైట్ సిటీ:భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కువైట్లోని భారత రాయబార కార్యాలయం సిద్ధమవుతోంది. ఆనాటి స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా 75 స్వాతంత్య్ర దినోత్సవ వేడులకలను నిర్వహించాలన్న భారత ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఈ నెల 31 నుంచి వేడుకలను నిర్వహించనున్నారు. అయితే కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో స్వాతంత్ర్య సన్నాహక వేడుకలను వర్చువల్ గానే నిర్వహిస్తారు. మార్చి 31న ఉదయం 10.30 గంటలకు ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ ప్రారంభం అవుతాయని వెల్లడించిన రాయబార కార్యాలయం..ఈ వేడుకల్లో కువైట్లోని భారతీయులు, భారత శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా పాల్గొనాలని కోరింది. వేడుకల్లో పార్టిసిపేట్ చేయాలనుకునేవారు మార్చి 31న 10.15 గంటలకు జూమ్ ద్వారా సెలబ్రేషన్స్ లో జాయిన్ అవ్వొచ్చని వివరించింది. రాయబార కార్యాలయం వెల్లడించిన జూమ్ లాగిన్ వివరాలు https://zoom.us/j/91423908856?pwd=d1Q1bDJEQkdKQVBLZExlSE9Qejgxdz09. మీటింగ్ కోడ్ 914 2390 8856 , మీటింగ్ ఐడీ 681987.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









