భారత 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..మార్చి 31 నుంచి ప్రారంభం
- March 26, 2021కువైట్ సిటీ:భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కువైట్లోని భారత రాయబార కార్యాలయం సిద్ధమవుతోంది. ఆనాటి స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా 75 స్వాతంత్య్ర దినోత్సవ వేడులకలను నిర్వహించాలన్న భారత ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఈ నెల 31 నుంచి వేడుకలను నిర్వహించనున్నారు. అయితే కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో స్వాతంత్ర్య సన్నాహక వేడుకలను వర్చువల్ గానే నిర్వహిస్తారు. మార్చి 31న ఉదయం 10.30 గంటలకు ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ ప్రారంభం అవుతాయని వెల్లడించిన రాయబార కార్యాలయం..ఈ వేడుకల్లో కువైట్లోని భారతీయులు, భారత శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా పాల్గొనాలని కోరింది. వేడుకల్లో పార్టిసిపేట్ చేయాలనుకునేవారు మార్చి 31న 10.15 గంటలకు జూమ్ ద్వారా సెలబ్రేషన్స్ లో జాయిన్ అవ్వొచ్చని వివరించింది. రాయబార కార్యాలయం వెల్లడించిన జూమ్ లాగిన్ వివరాలు https://zoom.us/j/91423908856?pwd=d1Q1bDJEQkdKQVBLZExlSE9Qejgxdz09. మీటింగ్ కోడ్ 914 2390 8856 , మీటింగ్ ఐడీ 681987.
తాజా వార్తలు
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్