కోవిడ్ కేర్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం..
- March 26, 2021
ముంబై:ముంబైలోని బాండూప్ ప్రాంతంలోని కరోనా ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మృతి చెందినవారి సంఖ్య తొమ్మిదికి చేరింది. కాగా ఆసుపత్రిలో 76 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని 23 ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆస్పత్రిలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చారు.
కాగా, ముంబైలో కరోనా మరోసారి విజృంభిస్తుండటంతో అధికారులు ఇటీవల షాపింగ్ మాల్ను కరోనా ఆస్పత్రిగా మార్చారు. షాపింగ్ మాల్లోని మూడో అంతస్తులో మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







