కోవిడ్ కేర్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం..
- March 26, 2021ముంబై:ముంబైలోని బాండూప్ ప్రాంతంలోని కరోనా ఆసుపత్రిలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మృతి చెందినవారి సంఖ్య తొమ్మిదికి చేరింది. కాగా ఆసుపత్రిలో 76 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని 23 ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆస్పత్రిలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చారు.
కాగా, ముంబైలో కరోనా మరోసారి విజృంభిస్తుండటంతో అధికారులు ఇటీవల షాపింగ్ మాల్ను కరోనా ఆస్పత్రిగా మార్చారు. షాపింగ్ మాల్లోని మూడో అంతస్తులో మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్