0.5 మిలియన్ వ్యాక్సినేషన్ మార్కు దాటిన కువైట్
- March 26, 2021
కువైట్ సిటీ: కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటిదాకా ఇచ్చిన వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య అర మిలియన్ దాటినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 504,666 డోసుల కోవిడ్ 19 వ్యాక్సిన్ని పౌరులు అలాగే నివాసితులకు అందజేయడం జరిగింది. కువైట్ మొత్తం జనాభాలో ఇది 11.82 శాతంగా వుంది. మరింత వేగంగా, ఇంకా ఎక్కువమందికి వ్యాక్సినేషన్ అందించేందుకు కువైట్ ప్రణాళికలు సిద్ధం చేసింది. సెప్టెంబర్ చివరి నాటికి 2 మిలియన్ల మందికి పైగా జనాభాకి వ్యాక్సినేషన్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం మొబైల్ యూనిట్స్ కూడా పనిచేస్తున్నాయి. కాగా, 1 మిలియన్ మంది వ్యాక్సిన్ కోసం ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు. కాగా, ఖతార్ తమ దేశ జనాభాలో 23 శాతం అంటే 600,000 మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







