0.5 మిలియన్ వ్యాక్సినేషన్ మార్కు దాటిన కువైట్
- March 26, 2021కువైట్ సిటీ: కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటిదాకా ఇచ్చిన వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య అర మిలియన్ దాటినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 504,666 డోసుల కోవిడ్ 19 వ్యాక్సిన్ని పౌరులు అలాగే నివాసితులకు అందజేయడం జరిగింది. కువైట్ మొత్తం జనాభాలో ఇది 11.82 శాతంగా వుంది. మరింత వేగంగా, ఇంకా ఎక్కువమందికి వ్యాక్సినేషన్ అందించేందుకు కువైట్ ప్రణాళికలు సిద్ధం చేసింది. సెప్టెంబర్ చివరి నాటికి 2 మిలియన్ల మందికి పైగా జనాభాకి వ్యాక్సినేషన్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం మొబైల్ యూనిట్స్ కూడా పనిచేస్తున్నాయి. కాగా, 1 మిలియన్ మంది వ్యాక్సిన్ కోసం ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు. కాగా, ఖతార్ తమ దేశ జనాభాలో 23 శాతం అంటే 600,000 మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించింది.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్