0.5 మిలియన్ వ్యాక్సినేషన్ మార్కు దాటిన కువైట్
- March 26, 2021కువైట్ సిటీ: కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటిదాకా ఇచ్చిన వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య అర మిలియన్ దాటినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 504,666 డోసుల కోవిడ్ 19 వ్యాక్సిన్ని పౌరులు అలాగే నివాసితులకు అందజేయడం జరిగింది. కువైట్ మొత్తం జనాభాలో ఇది 11.82 శాతంగా వుంది. మరింత వేగంగా, ఇంకా ఎక్కువమందికి వ్యాక్సినేషన్ అందించేందుకు కువైట్ ప్రణాళికలు సిద్ధం చేసింది. సెప్టెంబర్ చివరి నాటికి 2 మిలియన్ల మందికి పైగా జనాభాకి వ్యాక్సినేషన్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం మొబైల్ యూనిట్స్ కూడా పనిచేస్తున్నాయి. కాగా, 1 మిలియన్ మంది వ్యాక్సిన్ కోసం ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు. కాగా, ఖతార్ తమ దేశ జనాభాలో 23 శాతం అంటే 600,000 మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించింది.
తాజా వార్తలు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం