0.5 మిలియన్ వ్యాక్సినేషన్ మార్కు దాటిన కువైట్
- March 26, 2021కువైట్ సిటీ: కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటిదాకా ఇచ్చిన వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య అర మిలియన్ దాటినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 504,666 డోసుల కోవిడ్ 19 వ్యాక్సిన్ని పౌరులు అలాగే నివాసితులకు అందజేయడం జరిగింది. కువైట్ మొత్తం జనాభాలో ఇది 11.82 శాతంగా వుంది. మరింత వేగంగా, ఇంకా ఎక్కువమందికి వ్యాక్సినేషన్ అందించేందుకు కువైట్ ప్రణాళికలు సిద్ధం చేసింది. సెప్టెంబర్ చివరి నాటికి 2 మిలియన్ల మందికి పైగా జనాభాకి వ్యాక్సినేషన్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం మొబైల్ యూనిట్స్ కూడా పనిచేస్తున్నాయి. కాగా, 1 మిలియన్ మంది వ్యాక్సిన్ కోసం ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు. కాగా, ఖతార్ తమ దేశ జనాభాలో 23 శాతం అంటే 600,000 మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించింది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు