ఆస్కార్ గెలిచిన జాతిరత్నాలు..
- April 01, 2021హైదరాబాద్:టాలీవుడ్లో ఇటీవల రిలీజ్ అయిన పూర్తి కామెడీ ఎంటర్టైనర్ మూవీ జాతిరత్నాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు అనుదీప్ మలిచిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు పరుగులు తీశారు.ఇక ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి చేసిన కామెడీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
పక్కా కామెడీ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా భారీ కలెక్షన్లు వసూళు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జాతిరత్నాలు చిత్రానికి బెస్ట్ జానేజిగర్ విభాగంలో ఉత్తమ చిత్రంగా ఆస్కార్ నామినేషన్ లభించిందనే పోస్టర్ ప్రస్తుతం టాలీవుడ్లో దర్శనిమిస్తోంది. దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. జాతిరత్నాలు చిత్రం ఆస్కార్ అవార్డ్ ఎప్పుడు గెలిచిందబ్బా అంటూ వారు తలలు పట్టుకుంటున్నారు.
అయితే ఈరోజు ఏప్రిల్ 1 కావడంతో, ఆల్ ఫూల్స్ డే సందర్భంగా జాతిరత్నాలు చిత్ర యూనిట్ ప్రేక్షకులను బకరాలు చేసింది. అందుకే ఈ పోస్టర్ను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం తెలుసుకున్న ప్రేక్షకులు ఏప్రిల్ ఫూల్ అయ్యామని ఫీలవుతున్నారు. ఏదేమైనా కామెడీ జోనర్లో వచ్చిన జాతిరత్నాలు చిత్రం ప్రేక్షకులు ఈ విధంగా నవ్వించే ప్రయత్నం చేసిందని పలువురు అంటున్నారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు