కళ్యాణ్ రామ్ జర్నలిస్ట్ పాత్రలో ...
- March 01, 2016
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన కెరీర్లో ఇంతకముందెన్నడు చేయని ఓ డిఫరెంట్ రోల్ని చేసేందుకు సిద్దమయ్యాడని తెలుస్తుంది. గతేడాది పటాస్తో భారీ హిట్ని అందుకున్న కళ్యాణ్ రామ్ తన కెరీర్ని పక్కా ప్లానింగ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ హీరో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనుండగా, ఇందులో కళ్యాణ్ రామ్ జర్నలిస్ట్ పాత్రను చేయనున్నట్టు తెలుస్తుంది.ప్రేక్షకులకు పక్కా వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో వైవిధ్యమైన సినిమాలలో నటిస్తున్న కళ్యాణ్ రామ్ పవర్ఫుల్ జర్నలిస్ట్గా కనిపించనుండగా , ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తన సొంత బ్యానర్ అయిన నందమూరి ఆర్ట్స్ బ్యానర్పై కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, 'రీమిక్స్' అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.ఇంక ఈ చిత్రంలో హీరోయిన్గా ఎక్స్ప్రెస్ రాజాతో హిట్ అందుకున్న నార్త్ ఇండియన్ బ్యూటీ సురభిను ఎంపిక చేసే పనిలో ఉన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









