కళ్యాణ్ రామ్ జర్నలిస్ట్ పాత్రలో ...
- March 01, 2016
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన కెరీర్లో ఇంతకముందెన్నడు చేయని ఓ డిఫరెంట్ రోల్ని చేసేందుకు సిద్దమయ్యాడని తెలుస్తుంది. గతేడాది పటాస్తో భారీ హిట్ని అందుకున్న కళ్యాణ్ రామ్ తన కెరీర్ని పక్కా ప్లానింగ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ హీరో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనుండగా, ఇందులో కళ్యాణ్ రామ్ జర్నలిస్ట్ పాత్రను చేయనున్నట్టు తెలుస్తుంది.ప్రేక్షకులకు పక్కా వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో వైవిధ్యమైన సినిమాలలో నటిస్తున్న కళ్యాణ్ రామ్ పవర్ఫుల్ జర్నలిస్ట్గా కనిపించనుండగా , ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తన సొంత బ్యానర్ అయిన నందమూరి ఆర్ట్స్ బ్యానర్పై కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, 'రీమిక్స్' అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.ఇంక ఈ చిత్రంలో హీరోయిన్గా ఎక్స్ప్రెస్ రాజాతో హిట్ అందుకున్న నార్త్ ఇండియన్ బ్యూటీ సురభిను ఎంపిక చేసే పనిలో ఉన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







