భద్రత కల్పించలేం: పాక్-భారత్ మ్యాచ్పై
- March 01, 2016
పొట్టి ప్రపంచకప్లో భాగంగా మార్చి 19న హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియంలో జరగనున్న భారత్- పాకిస్థాన్ మ్యాచ్కు భద్రత కల్పించలేమని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కేంద్ర హోంమంత్రికి ఈ విషయాన్ని లేఖ ద్వారా తెలియజేశారు. అయితే దీనిపై బీసీసీఐ కార్యదర్శి, భాజపా ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. ఏడాది క్రితమే టీ20 ప్రపంచకప్ జరిగే వేదికలపై బీసీసీఐ నిర్ణయం తీసుకుందని.. మ్యాచ్ల షెడ్యూల్ కూడా ఆరు నెలల ముందే వెల్లడించామని ఠాకూర్ తెలిపారు. టోర్నీలో అత్యంత ఆసక్తికరమైన ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్లను ఇప్పటికే విక్రయించామని ఈ తరుణంలో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేయడం తగదన్నారు.పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ షహర్యార్ ఖాన్ ఇప్పటికే పాక్ క్రికెట్ జట్టు భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భారత్ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







