భద్రత కల్పించలేం: పాక్-భారత్ మ్యాచ్పై
- March 01, 2016
పొట్టి ప్రపంచకప్లో భాగంగా మార్చి 19న హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియంలో జరగనున్న భారత్- పాకిస్థాన్ మ్యాచ్కు భద్రత కల్పించలేమని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కేంద్ర హోంమంత్రికి ఈ విషయాన్ని లేఖ ద్వారా తెలియజేశారు. అయితే దీనిపై బీసీసీఐ కార్యదర్శి, భాజపా ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. ఏడాది క్రితమే టీ20 ప్రపంచకప్ జరిగే వేదికలపై బీసీసీఐ నిర్ణయం తీసుకుందని.. మ్యాచ్ల షెడ్యూల్ కూడా ఆరు నెలల ముందే వెల్లడించామని ఠాకూర్ తెలిపారు. టోర్నీలో అత్యంత ఆసక్తికరమైన ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్లను ఇప్పటికే విక్రయించామని ఈ తరుణంలో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేయడం తగదన్నారు.పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ షహర్యార్ ఖాన్ ఇప్పటికే పాక్ క్రికెట్ జట్టు భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భారత్ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









