భార‌త్ లోని ముస్లిం సోద‌రుల‌కు 4 ట‌న్నుల ఖ‌ర్జూరాల కానుక‌‌

- April 09, 2021 , by Maagulf
భార‌త్ లోని ముస్లిం సోద‌రుల‌కు 4 ట‌న్నుల ఖ‌ర్జూరాల కానుక‌‌

సౌదీ: ముస్లింల ప‌విత్ర ప్రార్థ‌న స్థ‌లాలైన మ‌క్కా, మ‌దీనా మ‌సీదుల త‌ర‌పున భార‌త్ లోని ముస్లిం సోద‌రుల‌కు ఖర్జూరాల‌ను కానుకగా పంపించారు కింగ్ స‌ల్మాన్‌.ఢిల్లీలోని సౌదీ అరేబియా కార్యాల‌యానికి అనుబంధంగా ఉన్న ముస్లిం సంస్థ‌లు గిఫ్ట్ ప్యాక్ ల‌ను ప‌లువురికి అందిస్తున్నారు.దేశంలోని ప‌లు ముస్లిం ప్ర‌ముఖుల‌కు, ఇస్లాం సంస్థ‌ల‌కు ఖ‌ర్చూర ప్యాకెట్ల‌ను పంపిస్తున్నారు.అయితే..కోవిడ్ నేప‌థ్యంలో అన్ని ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు పాటిస్తూ పంపిణీ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.ప్ర‌పంచ‌వ్యాప్తంగా ముస్లింల‌కు సౌదీ సంఘీభావంగా ఉంటుంద‌నే సందేశాన్ని చేర‌వేస్తూ ప్ర‌పంచంలోని దాదాపు 24 దేశాల‌కు సౌదీ గిఫ్ట్ ప్యాక్ ల‌ను పంపిస్తోంది. అదే త‌ర‌హాలో భార‌త్ కు కూడా 4 ట‌న్నుల ఖ‌ర్జూరాల‌ను గిఫ్ట్ గా పంపించింది.ముస్లిం సోద‌రుల‌కు క‌ష్టాన‌ష్టాల్లో తాము అండ‌గా ఉంటామ‌నే సందేశాన్ని పంపించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com