భారత్ లోని ముస్లిం సోదరులకు 4 టన్నుల ఖర్జూరాల కానుక
- April 09, 2021
సౌదీ: ముస్లింల పవిత్ర ప్రార్థన స్థలాలైన మక్కా, మదీనా మసీదుల తరపున భారత్ లోని ముస్లిం సోదరులకు ఖర్జూరాలను కానుకగా పంపించారు కింగ్ సల్మాన్.ఢిల్లీలోని సౌదీ అరేబియా కార్యాలయానికి అనుబంధంగా ఉన్న ముస్లిం సంస్థలు గిఫ్ట్ ప్యాక్ లను పలువురికి అందిస్తున్నారు.దేశంలోని పలు ముస్లిం ప్రముఖులకు, ఇస్లాం సంస్థలకు ఖర్చూర ప్యాకెట్లను పంపిస్తున్నారు.అయితే..కోవిడ్ నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు సౌదీ సంఘీభావంగా ఉంటుందనే సందేశాన్ని చేరవేస్తూ ప్రపంచంలోని దాదాపు 24 దేశాలకు సౌదీ గిఫ్ట్ ప్యాక్ లను పంపిస్తోంది. అదే తరహాలో భారత్ కు కూడా 4 టన్నుల ఖర్జూరాలను గిఫ్ట్ గా పంపించింది.ముస్లిం సోదరులకు కష్టానష్టాల్లో తాము అండగా ఉంటామనే సందేశాన్ని పంపించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









