చాలాకాలంగా రోడ్ సైడ్ పార్క్ చేసిన 24 కార్ల స్వాధీనం
- April 15, 2021
కువైట్ సిటీ: రోడ్డుకు ఇరువైపుల, పార్కింగ్ కోసం నిర్దేశించిన ప్రాంతాల్లో కాకుండా ఇష్టానుసారంగా వాహనాలను పార్క్ చేయవద్దని అధికారులు ఎంతగా చెప్పినా కొందరు పెడచెవిన పెడుతున్నారు.రోడ్డు పక్కల చాలా కాలంగా పార్క్ చేసిన వాహనాలతో సిటీ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని...వాటిని వెంటనే తొలగించాలని ఓనర్లకు సూచించినా పట్టించుకోవటం లేదు. దీంతో ఫార్వానియా గవర్నరేట్లోని అరియా ప్రాంతాల్లో కొంతకాలంగా పార్క్ చేసి ఉన్న 24 వాహనాలను మున్సిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.రోడ్ వర్క్స్ , పబ్లిక్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ డ్రైవ్ చేపట్టారు. పార్క్ చేసిన వాహనాలను వాటి ఓనర్లు అలాగే వదిలివేయటంతో తమకు ఇబ్బందిగా మారిందని స్థానికుల నుంచి ఫిర్యాదులు రావటంతో మున్సిపాలిటీ అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









