'దృశ్యం-2' షూటింగ్ పూర్తి
- April 15, 2021హైదరాబాద్: బ్లాక్ బస్టర్ మలయాళ రీమేక్ 'దృశ్యం' చిత్రానికి సీక్వెల్ గా 'దృశ్యం-2' తెరకెక్కుతోంది.మొదటి పార్ట్ లో నటించిన నటీనటులే ఈ సీక్వెల్ లోనూ నటిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్,హీరోయిన్ మీనా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న 'దృశ్యం-2' నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేశారు వెంకటేష్.చిత్రంలో వెంకటేష్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యింది.ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ ఓ పిక్ ను విడుదల చేశారు. కాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా మలయాళంలో తెరకెక్కిన 'దృశ్యం' బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.దీంతో ఈ చిత్రాన్ని దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో రూపొందించారు.అన్ని భాషల్లోనూ ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. 'దృశ్యం, దృశ్యం-2' మలయాళంలో మోహన్ లాల్ నటించగా తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగన్ రీమేక్ చేశారు.ఇక తెలుగులో 'దృశ్యం' చిత్రానికి ప్రముఖ నటి శ్రీప్రియ దర్శకత్వం వహించారు. అయితే 'దృశ్యం-2' తెలుగు రీమేక్ కు మాత్రం దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే 'దృశ్యం-2' ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు