కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- April 24, 2026
అస్తానా: ఆర్థిక వ్యవహారాల ఉప ప్రధానమంత్రి సయ్యద్ థెయాజిన్ బిన్ హైతం అల్ సయీద్ మరియు కజకిస్తాన్ ప్రధానమంత్రి సమావేశం నిర్వహించారు. ఇరు దేశాల అభివృద్ధికి అనుగుణంగా.. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలను సుసంపన్నం చేసే రీతిలో.. ఖ్యంగా ఇంధనం, గనుల తవ్వకం, సాంకేతికత, పర్యాటకం, విద్య మరియు లాజిస్టిక్స్ రంగాలలోసహకార అవకాశాలను విస్తరించే మార్గాలపై వారు చర్చించారు.
ఆర్థిక వ్యవహారాల ఉప ప్రధానమంత్రి సయ్యద్ థెయాజిన్ బిన్ హైతం అల్ సయీద్ మరియు కజకిస్తాన్ గణతంత్ర ప్రధానమంత్రి ఓల్జాస్ బెక్టెనోవ్ సమక్షంలో ఒమన్ సుల్తానేట్ మరియు ఉజ్బెకిస్తాన్ గణతంత్ర దేశాలు తమ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పడానికి ఒక ప్రాథమిక ఒప్పందంపై సంతకం చేశాయి. ఇరు దేశాలలో ఉన్న ఆశాజనకమైన అవకాశాలను అభివృద్ధి చేయడానికి మరియు వాటిలో పెట్టుబడులు పెట్టడానికి ఒక ఉమ్మడి పెట్టుబడి నిధిని ఏర్పాటు చేయడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది.
సయ్యద్ థెయాజిన్ కజకిస్తాన్ పర్యటనలో భాగంగా జరిగిన అధికారిక పర్యటన సందర్భంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
తాజా వార్తలు
- కువైట్లో 11 ఎక్స్ఛేంజ్ కంపెనీలపై తాత్కాలిక సస్పెన్షన్..!!
- గల్ఫ్లో సైబర్ దాడులు.. యూఏఈ, సౌదీ అరేబియాపైనే 50 శాతం..!!
- ఫిషింగ్, ఫేక్ మెసేజులపై ఖతార్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్నింగ్..!!
- ఒమన్లో విరిగిపడ్డ కొండచరియలు.. వాహనదారులకు కీలక హెచ్చరిక..!!
- AI వినియోగంపై అరబ్ దేశాలకు కీలక సూచనలు..!!
- సౌదీ నేషనల్ డే వేడుకలు.. జెడ్డా నుంచి అల్ ఖోబర్ వరకు వైమానిక విన్యాసాలు..!!
- సౌదీ అరేబియాకు యుద్ధ విమానాల విక్రయానికి అమెరికా ఆమోదం
- దుగరాజపట్నంలో గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
- అక్టోబర్ 7న తిరిగి తెరుచుకోనున్న దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్
- కువైట్లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!







