పర్యాటకులకు అందుబాటులో అత్యాధునిక పడవల సేవలు

- March 02, 2016 , by Maagulf
పర్యాటకులకు అందుబాటులో అత్యాధునిక పడవల సేవలు

ప్రధాన పర్యాటక ప్రాంతమైన హుస్సేన్‌సాగర్‌లో విహరించాలనుకునే పర్యాటకులకు అత్యాధునిక పడవల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పడవలను టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా బుధవారం ప్రారంభించారు. ఒక పడవలో పయనించి సానియా సందడి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ పేర్వారం రాములు, ఎండీ క్రిష్టినా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సానియా మీడియాతో మాట్లాడుతూ హైదరాబాదీని కావడం గర్వంగా ఉందని అన్నారు. తెలంగాణలో చాలా పట్టణాలు తమకు తెలియవని, వాటన్నిటినీ చూడాలనుకుంటున్నానని, హైదరాబాద్‌లో భిన్న సంస్కృతి కనిపిస్తుందని ఆమె అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com