విమానమెక్కాలంటే ఫైన్స్ క్లియర్ చెయ్యాల్సిందే
- June 01, 2015
సమ్మర్ హాలీడేస్ కోసమో, ఇతర కారణాలతోనో విదేశాలకు వెళ్లాలనుకునేవారు ట్రాఫిక్ ఫైన్స్ క్లియర్ చెయ్యాల్సిందేనని రాయల్ ఒమాన్ పోలీసులు స్పష్టం చేశారు. కొత్తగా రూపొందించిన ఈ నిబంధన ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. తాత్కాలికంగా అయినా, పర్మనెంట్గా అయినా దేశం విడిచి వెళ్ళాలనుకునేవారు విమానాశ్రయాలు, సరిహద్దుల్లో ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేశారు రాయల్ ఒమాన్ పోలీసులు. ట్రాఫిక్ ఫైన్స్ చెల్లింపులపై అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నామనీ, ఇకపై ఫైన్స్ పెండింగ్లో ఉండకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెప్పారు. ఇలాంటి చర్యల ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలపై వాహనదారులు అప్రమత్తంగా ఉంటారని రాయల్ ఒమాన్ పోలీసు వర్గాలు వెల్లడించాయి.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









