అమరావతిలోనే హై కోర్ట్ న్యాయస్థానం

- March 03, 2016 , by Maagulf
అమరావతిలోనే హై కోర్ట్ న్యాయస్థానం

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును విభజించి ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ అన్నారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ ఈరోజు కేంద్రమంత్రిని కలిసి ఏపీలో హైకోర్టు ఏర్పాటుపై చర్చించారు. రాజధాని నగరమైన అమరావతిలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తిని మన్నించిన సదానందగౌడ అమరావతిలోనే న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com