క్వారంటైన్ హోటల్స్: డిస్కవర్ ఖతార్ బుకింగ్స్ ప్రారంభం
- April 28, 2021
దోహా: బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ మరియు శ్రీలంక దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు 10 రోజుల తప్పనిసరి హోటల్ క్వారంటైన్ కోసం బుకింగ్స్ ప్రారంభించింది డిస్కవర్ ఖతార్. మొత్తం 45 ప్యాకేజీలను 3, 4 మరియు 5 స్టార్ హోటల్ అకామడేషన్ కోసం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 29 నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. 3,500 ఖతారీ రియాల్స్ నుంచి 8,500 ఖతారీ రియాల్స్ వరకు ప్యాకేజీలు వుంటాయి. పైన పేర్కొన్న దేశాల నుంచి రానివారికి ఈ హోటళ్ళలో అవకాశం వుండదు. ఏప్రిల్ 26 నుంచి ప్రయాణీకులంతా ప్రయాణానికి 48 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్ కలిగి వుండాలి. కాగా, వ్యాక్సినేషన్ పొందినవారికీ, గతంలో కరోనా సోకినవారికి ఎలాంటి మినహాయింపులు వుండవు. కాగా, ఏప్రిల్ 28వ తేదీ కంటే ముందు బుక్ చేసుకున్నవారికి డిస్కవరీ ఖతార్ వోచర్లు వర్తిస్తాయి. కాగా, ఏప్రిల్ 29 తర్వాత వచ్చేవారు, అప్పటికే బుకింగ్ చేసుకుని వుంటే, వారిని సంప్రదించి, ఒరిజినల్ బుకింగ్ క్యాన్సిల్ అయిన విషయాన్ని తెలియజేస్తారు. తిరిగి వారు హోటల్ బుకింగ్ కొత్తగా చేసుకోవాల్సి వుంటుంది. 27 ఏప్రిల్ తర్వాత బుక్ చేసుకున్నవారికి 100 శాతం క్యాన్సిలేషన్ ఫీజు వర్తిస్తుంది. పైన పేర్కొన్న దేశాల నుంచి ట్రాన్సిటింగ్ చేయనివారికి చెకిన్ కోసం అనుమతించరు. రిఫండ్ కూడా ఇలాంటివారికి వర్తించదు.
--రాజ్ కుమార్ వనం బత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- పంజాబ్స్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం..
- పీ-8ఐ యుద్ధ విమానాల భారీ నిర్వహణ కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–బోయింగ్ డిఫెన్స్ ఇండియా ఒప్పందం
- తైవాన్ జోలికొస్తే యుద్ధమే.. ట్రంప్కు జిన్పింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
- సీఎం విజయ్ మరో బిగ్ డెసిషన్..
- సముద్రంలో భారత నౌక జలసమాధి.. హైజాకర్ల చేతిలో మరో షిప్!
- ఇంధన పొదుపు, విదేశీ మారకద్రవ్యం ఆదాకు ప్రజలు సహకరించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- BRICS దేశాల విదేశాంగ మంత్రులతో భారత్ చర్చలు
- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..వారానికి ఒక రోజు ‘నో వెహికిల్ డే’!
- ఛార్ధామ్ యాత్ర మొదలైన 26 రోజుల్లోనే 38 మంది భక్తులు మృతి
- సౌదీ అరేబియాలో 19 మందికి జరిమానాలు..!!









