కరోనా నుంచి కోలుకున్న సీఎం కేసీఆర్

- April 28, 2021 , by Maagulf
కరోనా నుంచి కోలుకున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్: కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ కొలుకున్నారు.ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎం.వి రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం..సీఎం కేసీఆర్ కు ఇవాళ తన వ్యవసాయ క్షేత్రంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించింది.ఈ సందర్భంగా రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసియార్ పరీక్షలు నిర్వహించారు.యాంటిజెన్ టెస్టులో సిఎం కెసిఆర్ కు కరోనా నెగిటివ్ వచ్చింది.ఇక ఆర్టీపీసియార్ పరీక్షా ఫలితాలు రేపు రానున్నాయి.కాగా సీఎం కేసీఆర్ కు ఈ నెల 19 న కరోనా పాజిటివ్ వచ్చింది.ఆ తర్వాత మంత్రి కేటీఆర్ కు  కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com