లాక్డౌన్ పై క్లారిటీ ఇచ్చిన టి.హోం మంత్రి
- April 28, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 సెకండ్ వేవ్ నేపథ్యంలో, ప్రస్తుతం పోలీస్ శాఖ ద్వారా తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మొహమ్మద్ మహమూద్ అలీ బుధవారం నాడు లక్డికాపూల్ లోని తన కార్యాలయంలో, హోం శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రవి గుప్త, డిజిపి మహేందర్ రెడ్డి,హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్,రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వి.సి.సజ్జనార్, హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ అనిల్ కుమార్ లతో సమీక్ష జరిపారు.లాక్డౌన్పై తుది నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు డిప్యూటీ సీఎం,హోంమంత్రి మహమూద్ అలీ.లాక్ డౌన్ పెట్టాలా లేదా అన్నది మాత్రం సీఎం నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

తర్వలో రాష్ట్రంలోని పరిస్ధితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారన్న ఆయన సమీక్ష తర్వాత లాక్ డౌన్పై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని కానీ, లాక్ డౌన్ పెట్టడం సీఎంకు ఇష్టం లేదన్నారు.ప్రస్తుత పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ఆయన.. లాక్డౌన్ వల్ల ఆర్ధిక ఇబ్బందులు చాలా వస్తాయన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.మరణాలు కూడా పెరుగుతున్నాయి.కరోనా కేసులను అసరాగ చేసుకుని బ్లాక్ మార్కెట్ దందా కూడా విచ్చలవిడిగా కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేసిన మహమూద్ అలీ.ఆక్సిజన్ నుంచి రెమిడిసివర్ ఇంజక్షన్ వరకూ బ్లాక్ మార్కెట్ దందా జరుగుతుందని..బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించాం అన్నారు.కాగా, రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇప్పటికే హోంశాఖకు ప్రతిపాదనలు అందగా..త్వరలోనే లాక్డౌన్ పై అధికారిక ప్రకటన వస్తుందనే ప్రచారం సాగుతోంది.ఈ నెల 30 తర్వాత లాక్డౌన్కు వెళ్తారని సమాచారం అందుతుండగా కేసీఆర్దే ఫైనల్ నిర్ణయం అంటున్నారు మహమూద్ అలీ.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







