గ్రేహౌండ్స్ దళం భవిష్యత్ కార్యాచరణ పై సమీక్షించిన డిజిపి ఆనంద్
- May 14, 2026
మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణపై చర్చ
హైదరాబాద్: గ్రేహౌండ్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆ దళం ప్రస్తుత కార్యాచరణ సామర్థ్యం, భవిష్యత్ సన్నద్ధతపై ఉన్నతస్థాయి సమీక్ష డిజిపి ఆనంద్ నిర్వహించారు. మావోయిస్టు కార్యకలాపాలు దాదాపు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో గ్రేహౌండ్స్ దళం పునర్వ్యవస్థీకరణ, సిబ్బంది తగ్గింపు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
భవిష్యత్లో తలెత్తే భద్రతా సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు కనీస స్థాయిలో ఎంతమంది సిబ్బంది అవసరమవుతారన్న దానిపై అధికారులు విశ్లేషణ జరిపారు.
ఈ సమావేశంలో అధునాతన శిక్షణ, సామర్థ్యాల పెంపు, ఆధునికీకరణ, మౌలిక వసతుల అభివృద్ధి, పరిపాలనా సహకారం, సిబ్బంది సంక్షేమ కార్యక్రమాలు వంటి అంశాలపై కూడా సమగ్ర చర్చ జరిగింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రత్యేక దళంగా గుర్తింపు పొందిన గ్రేహౌండ్స్ మరింత సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
అలాగే రాబోయే ఐదేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చించారు. దళాన్ని సాంకేతికంగా మరింత బలోపేతం చేసి, ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్







