తెలంగాణలో జర్నలిస్టుల కోసం హెల్ప్ డెస్క్
- May 01, 2021
హైదరాబాద్: తెలంగాణలో జర్నలిస్టులకు కోవిడ్ వైద్యేసవలు అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా హెల్ప్డెస్క్ ఏర్పాటుచేస్తున్నట్లు హైదరాబాద్ ప్రెస్క్లబ్ ప్రతినిధులు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ప్రెస్క్లబ్ ప్రతినిధి బృందం శుక్రవారం సమావేశమైంది. జర్నలిస్టుల అవసరాలను గుర్తించిన అధికారులు శనివారం నుంచి ప్రత్యేక వాట్సాప్ నంబర్ 8639710241 ను అందుబాటులో ఉంచుతామని చెప్పారు.కరోనా లక్షణాలున్న జర్నలిస్టుల వివరాలను అందులో అప్లోడ్ చేస్తే పరిశీలించి వైద్య పరీక్షలు, మందుల కిట్లు, అవసరమైన వారికి బెడ్లను కేటాయించేందుకు ప్రత్యేక బృందాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు.జర్నలిస్టుల కోసం త్వరలో హైదరాబాద్ ప్రెస్క్లబ్తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









