తెలంగాణలో జర్నలిస్టుల కోసం హెల్ప్ డెస్క్
- May 01, 2021
హైదరాబాద్: తెలంగాణలో జర్నలిస్టులకు కోవిడ్ వైద్యేసవలు అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా హెల్ప్డెస్క్ ఏర్పాటుచేస్తున్నట్లు హైదరాబాద్ ప్రెస్క్లబ్ ప్రతినిధులు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ప్రెస్క్లబ్ ప్రతినిధి బృందం శుక్రవారం సమావేశమైంది. జర్నలిస్టుల అవసరాలను గుర్తించిన అధికారులు శనివారం నుంచి ప్రత్యేక వాట్సాప్ నంబర్ 8639710241 ను అందుబాటులో ఉంచుతామని చెప్పారు.కరోనా లక్షణాలున్న జర్నలిస్టుల వివరాలను అందులో అప్లోడ్ చేస్తే పరిశీలించి వైద్య పరీక్షలు, మందుల కిట్లు, అవసరమైన వారికి బెడ్లను కేటాయించేందుకు ప్రత్యేక బృందాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు.జర్నలిస్టుల కోసం త్వరలో హైదరాబాద్ ప్రెస్క్లబ్తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







