ఢిల్లీలో లాక్డౌన్ మళ్లీ పొడిగింపు
- May 01, 2021
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో మరోసారి లాక్డౌన్ పొడిగించారు.ఇప్పటికే రెండో విడతలగా లాక్డౌన్ విధించినా.. కోవిడ్ కంట్రోల్ కావడం లేదు.దీంతో.. మరో వారం రోజుల పాటు లాక్డౌన్ ఉంటుంది అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. కాగా, ఢిల్లీలో తాజాగా 27,000 కొత్త కేసులు నమోదు కాగా.. 375 మంది మృతిచెందారు.ఇలా వరుసగా 13వ రోజు 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.దీంతో.. మరోవారం పాటు లాక్డౌన్ ఆంక్షలు పొడిగించారు.కోవిడ్ సెకండ్ వేవ్ కట్టడికి మొదట ఏప్రిల్ 19 నుంచి 26వ తేదీ వరకు లాక్డౌన్ విధించిన ఢిల్లీ ప్రభుత్వం.. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మే 3వ తేదీ వరకు పొడిగించారు.ఇంకా.. పరిస్థితిలో ఏ మాత్రం తేడా లేకపోవడంతో..మరో వారం రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.దీంతో..ఈ నెల 10వ తేదీ వరకు ఢిల్లీలో లాక్డౌన్ అమల్లో ఉండబోతోంది.
తాజా వార్తలు
- 14 లక్షల మంది రైతులకు రూ.75,000 రుణమాఫీ!
- అపోలో హెల్త్టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్గా శోభన కామినేని
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!
- షార్జా బ్యాంక్ మిలియనీర్ క్యాంపెయిన్..Dh2 మిలియన్లు గెలిచిన భారత ప్రవాసి..!!
- మక్కాలో పవిత్ర కాబాను కొత్త 'కిస్వా'తో అలంకరణ..!!
- ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన ఒమన్..!!
- T4 టెర్మినల్ నుంచి ఒకే ఫారీన్ ఫ్లైట్ కు అనుమతి..!!
- తల్లి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష..!!
- 22 మంది చిన్నారుల మృతి.. ‘దగ్గు సిరప్’ల పై కేంద్రం కీలక నిర్ణయం..









