7 దేశాల పై ఆంక్షలు విధించిన ఇజ్రాయెల్
- May 02, 2021
జెరూసలేం: కోవిడ్ సెకండ్ వేవ్ ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది.దీంతో.. క్రమంగా చాలా దేశాలు విదేశీ ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయి.తమ దేశస్తులు అయినా సరే విదేశాలకు వెళ్తే.. మళ్లీ అంత ఈజీగా వాళ్లు స్వదేశంలో అడుగుపెట్టే పరిస్థితులు లేకుండా పోతున్నాయి.తాజాగా.. భారత్ సహా ఏడు దేశాలకు తమ పౌరులు ప్రయాణించకుండా ఆంక్షలు విధించింది ఇజ్రాయెల్ .. కోవిడ్ నేపథ్యంలో..ఇజ్రాయెల్ తమ దేశ పౌరులపై ఈ ఆంక్షలు తీసుకొచ్చింది.ఈ నెల 3వ తేదీ నుంచి కొత్త ఆంక్షలు అమలులోకి రానుండగా.. 16వ తేదీ వరకు ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించింది ఇజ్రాయెల్.ఇక, ఇజ్రాయెల్ ఆంక్షలు విధించిన దేశాల జాబితా గమనిస్తే భారత్లో పాటు ఉక్రెయిన్, బ్రెజిల్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా,మెక్సికో,టర్కీ కూడా ఉన్నాయి.ఈ ఏడు దేశాల నుంచి ఇజ్రాయెల్ వచ్చే ప్రయాణికులు మాత్రం 14 రోజులు క్వారంటైన్లో ఉండటం తప్పనిసరి చేసింది.
తాజా వార్తలు
- 14 లక్షల మంది రైతులకు రూ.75,000 రుణమాఫీ!
- అపోలో హెల్త్టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్గా శోభన కామినేని
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!
- షార్జా బ్యాంక్ మిలియనీర్ క్యాంపెయిన్..Dh2 మిలియన్లు గెలిచిన భారత ప్రవాసి..!!
- మక్కాలో పవిత్ర కాబాను కొత్త 'కిస్వా'తో అలంకరణ..!!
- ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన ఒమన్..!!
- T4 టెర్మినల్ నుంచి ఒకే ఫారీన్ ఫ్లైట్ కు అనుమతి..!!
- తల్లి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష..!!
- 22 మంది చిన్నారుల మృతి.. ‘దగ్గు సిరప్’ల పై కేంద్రం కీలక నిర్ణయం..









