విజయవాడ విమానాశ్రయంలో కఠిన ఆంక్షలు
- May 04, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.ఇప్పటికే ఏపీలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.తాజాగా మరికొన్ని ఆంక్షలు అమలు చేస్తున్నారు.ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం విమానాశ్రయం లో ఆంక్షలను కఠినంగా అమలు చేయబోతున్నారు.విమానాశ్రయం ఆవరణలోకి ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.ప్రయాణికుడితో పాటుగా డ్రైవర్ కు మాత్రమే విమానాశ్రయం ఆవరణలోకి అనుమతి ఉంటుంది.వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులను ప్రాధాన ద్వారం వద్దే నిలిపివేయనున్నారు.ఇక ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా,ఇకపై దేశీయ ప్రయాణికులకు కూడా విమానాశ్రయంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.పాజిటివ్ వచ్చిన ప్రయాణికులను అక్కడి నుంచి క్వారంటైన్ కు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









