విజయవాడ విమానాశ్రయంలో కఠిన ఆంక్షలు
- May 04, 2021
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.ఇప్పటికే ఏపీలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.తాజాగా మరికొన్ని ఆంక్షలు అమలు చేస్తున్నారు.ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం విమానాశ్రయం లో ఆంక్షలను కఠినంగా అమలు చేయబోతున్నారు.విమానాశ్రయం ఆవరణలోకి ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.ప్రయాణికుడితో పాటుగా డ్రైవర్ కు మాత్రమే విమానాశ్రయం ఆవరణలోకి అనుమతి ఉంటుంది.వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులను ప్రాధాన ద్వారం వద్దే నిలిపివేయనున్నారు.ఇక ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా,ఇకపై దేశీయ ప్రయాణికులకు కూడా విమానాశ్రయంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.పాజిటివ్ వచ్చిన ప్రయాణికులను అక్కడి నుంచి క్వారంటైన్ కు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







