తమిళనాడులో సంపూర్ణ లాక్ డౌన్
- May 08, 2021
చెన్నై: భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి.మరణాల సంఖ్య వేలల్లో ఉంటోంది.ప్రతి రోజు 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు,వీకెండ్ లాక్ డౌన్ లు,సంపూర్ణ లాక్ డౌన్ వంటి ఆంక్షలు విధిస్తున్నాయి.అయితే తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా రాష్ట్రంలో సంపూర్ణ లాక్ డౌన్ విధించింది.రాష్ట్రంలో 14 రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నామని, ఈ నెల 10 ఉదయం ఆరు గంటల నుంచి 24 అర్ధరాత్రి వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని తమిళనాడు సర్కార్ పేర్కొంది.కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది.మే 10 నుంచి నిత్యావసర దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరచి ఉంటాయని పేర్కొంది ప్రభుత్వం.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు







