తమిళనాడులో సంపూర్ణ లాక్ డౌన్
- May 08, 2021
చెన్నై: భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి.మరణాల సంఖ్య వేలల్లో ఉంటోంది.ప్రతి రోజు 4 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు,వీకెండ్ లాక్ డౌన్ లు,సంపూర్ణ లాక్ డౌన్ వంటి ఆంక్షలు విధిస్తున్నాయి.అయితే తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా రాష్ట్రంలో సంపూర్ణ లాక్ డౌన్ విధించింది.రాష్ట్రంలో 14 రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నామని, ఈ నెల 10 ఉదయం ఆరు గంటల నుంచి 24 అర్ధరాత్రి వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని తమిళనాడు సర్కార్ పేర్కొంది.కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది.మే 10 నుంచి నిత్యావసర దుకాణాలు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరచి ఉంటాయని పేర్కొంది ప్రభుత్వం.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









