కడప జిల్లాలో పేలుడు.. 10 మంది కూలీల దుర్మరణం

- May 08, 2021 , by Maagulf
కడప జిల్లాలో పేలుడు.. 10 మంది కూలీల దుర్మరణం

ఏపీ: ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది.కడప జిల్లాలో భారీ పేలుడు సంభవించి 10 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు.పేలుడు పదార్థాల బ్లాస్టింగ్ లో ఈ దుర్ఘటన జరిగింది.

కడప జిల్లా పోరుమామిళ్ల మండలం మామిళ్లపల్లి ముగ్గురాళ్ల గనిలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది.పేలుడు పదార్థాల క్రషర్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది.ముగ్గురాయిని వెలికి తీసేందుకు కూలీలు వెళ్లారు.ఆ సమయంలో పేలుడు సంభవించింది.

సంఘటనా స్థలం అటవీ ప్రాంతంలో ఉంటుంది. పోలీసులకు సమాచారం అందింది. వారు అక్కడికి బయలుదేరారు.ఏడు మృతదేహాలను వెలికి తీశారు.మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి.

డిటొనేటర్ పేలుడు వల్ల ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. గాయపడినవారిని వివిధ ప్రాంతాల ఆస్పత్రులకు తరలించే పనిచేస్తున్నారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ముగ్గురాయిని పేల్చేందుకు డిటొనేటర్ వాడుతారు.రోజువారీ పనిలో భాగంగానే డెటొనేటర్ ను అమర్చారు. అది పేలిన సమయంలో కూలీలంతా అక్కడే ఉన్నారు.ప్రమాదం జరిగిన సమయంలో 30 మంది దాకా అక్కడ ఉన్నట్లు చెబుతున్నారు.యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందనే విమర్శలు వస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com