హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- June 28, 2026
హైదరాబాద్: గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ (RPL) ఫైనల్ మ్యాచ్ క్రీడాభిమానులను ఉర్రూతలూగించింది. హైదరాబాద్ హీరోస్, ముంబై డ్రీమర్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ పోరును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వీక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి,ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, SARG చైర్మన్ శివసేనా రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.అలాగే ప్రముఖ సినీ నటుడు Chiranjeevi కూడా హాజరై మ్యాచ్ను ఆసక్తిగా వీక్షించారు.
ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ హీరోస్ అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్ను సొంతం చేసుకుంది.
విజేత జట్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రోఫీని అందజేసి అభినందనలు తెలిపారు. క్రీడాకారుల ప్రతిభను కొనియాడుతూ, తెలంగాణలో క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ ఫైనల్ పోటీకి భారీ సంఖ్యలో క్రీడాభిమానులు హాజరై ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. గచ్చిబౌలి స్టేడియం క్రీడాస్ఫూర్తి, ఉత్సాహభరిత వాతావరణంతో కళకళలాడింది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







