ఒమాన్ లో ఉపాధ్యాయుల గదికి నిప్పు పెట్టిన విద్యార్ధులు
- March 04, 2016
గురువుగారి ఇంట్లో ఎలుక ఉందని...ఎంతకీ దొరకని దాన్ని ఎలాగైనా చంపాలని ఏకం గా కొంపకు నిప్పు పెట్టారు నాటి పాతకాలం పరమానందయ్య శిష్యులు..అసలు చదువు చెప్పేవారే లేకపోతే మనకు బడిలో ఎదురు ఉండదని బహుశా భావించేరేమో నేటి తరం ఆ గడుగ్గాయులు.....ఉపాధ్యాయుల గదికి నిప్పు పెట్టి రాయల్ ఒమాన్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. సోహార్ లోని ఒక పాఠశాలకు చెందిన అయిదుగురు ఉపాధ్యాయిని గదిని అగ్నికి ఆహుతి చేయబోయారు. ఈ విషయాన్ని పోలీసులకు కొందరు తెలియడంతో రాయల్ ఒమాన్ పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని నియంత్రించారు. కాగా అరెస్ట్ కాబడిన ఐదుగురు విద్యార్థులు తాము రోజూ సాయంత్రం పాఠశాలలో తలదాచుకునేవారమని 'గాసోలిన్' ఉపయోగించి అగ్ని రాజేసి ఉపాధ్యాయుల గదికి ముట్టించినట్లు వారు అంగీకరించారు.
తాజా వార్తలు
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!
- తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!









