ఒమాన్ లో ఉపాధ్యాయుల గదికి నిప్పు పెట్టిన విద్యార్ధులు
- March 04, 2016
గురువుగారి ఇంట్లో ఎలుక ఉందని...ఎంతకీ దొరకని దాన్ని ఎలాగైనా చంపాలని ఏకం గా కొంపకు నిప్పు పెట్టారు నాటి పాతకాలం పరమానందయ్య శిష్యులు..అసలు చదువు చెప్పేవారే లేకపోతే మనకు బడిలో ఎదురు ఉండదని బహుశా భావించేరేమో నేటి తరం ఆ గడుగ్గాయులు.....ఉపాధ్యాయుల గదికి నిప్పు పెట్టి రాయల్ ఒమాన్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. సోహార్ లోని ఒక పాఠశాలకు చెందిన అయిదుగురు ఉపాధ్యాయిని గదిని అగ్నికి ఆహుతి చేయబోయారు. ఈ విషయాన్ని పోలీసులకు కొందరు తెలియడంతో రాయల్ ఒమాన్ పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని నియంత్రించారు. కాగా అరెస్ట్ కాబడిన ఐదుగురు విద్యార్థులు తాము రోజూ సాయంత్రం పాఠశాలలో తలదాచుకునేవారమని 'గాసోలిన్' ఉపయోగించి అగ్ని రాజేసి ఉపాధ్యాయుల గదికి ముట్టించినట్లు వారు అంగీకరించారు.
తాజా వార్తలు
- సైబరాబాద్, రాచకొండ వెబ్సైట్లు హ్యాక్
- హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి
- రూపాయి కుప్పకూలింది..
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!







