ఒమాన్ లో ఉపాధ్యాయుల గదికి నిప్పు పెట్టిన విద్యార్ధులు
- March 04, 2016
గురువుగారి ఇంట్లో ఎలుక ఉందని...ఎంతకీ దొరకని దాన్ని ఎలాగైనా చంపాలని ఏకం గా కొంపకు నిప్పు పెట్టారు నాటి పాతకాలం పరమానందయ్య శిష్యులు..అసలు చదువు చెప్పేవారే లేకపోతే మనకు బడిలో ఎదురు ఉండదని బహుశా భావించేరేమో నేటి తరం ఆ గడుగ్గాయులు.....ఉపాధ్యాయుల గదికి నిప్పు పెట్టి రాయల్ ఒమాన్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. సోహార్ లోని ఒక పాఠశాలకు చెందిన అయిదుగురు ఉపాధ్యాయిని గదిని అగ్నికి ఆహుతి చేయబోయారు. ఈ విషయాన్ని పోలీసులకు కొందరు తెలియడంతో రాయల్ ఒమాన్ పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని నియంత్రించారు. కాగా అరెస్ట్ కాబడిన ఐదుగురు విద్యార్థులు తాము రోజూ సాయంత్రం పాఠశాలలో తలదాచుకునేవారమని 'గాసోలిన్' ఉపయోగించి అగ్ని రాజేసి ఉపాధ్యాయుల గదికి ముట్టించినట్లు వారు అంగీకరించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో క్షిపణి పడి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
- కతార్ ఎమిర్–అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- ICC Mens T20 World Cup Final: ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్ పై భారత్ భారీ స్కోర్
- కువైట్ గగనతలం తాత్కాలిక మూసివేత
- ఇరాన్ పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- ఒమన్ లో సాధారణ స్థితికి రవాణా కార్యకలాపాలు..!!
- ఫుడ్, నాన్ ఫుడ్ లభ్యత పై అవుట్లెట్లు భరోసా..!!
- రియాద్ మీదుగా డ్రోన్లతో ఇరాన్ అటాక్..అడ్డుకున్న ఢిఫెన్స్ సిస్టమ్..!!
- బహ్రెయిన్ లో నీటి సరఫరా పై ప్రభావం చూపని ఇరాన్ దాడి..!!
- సెక్యూరిటీ అలెర్ట్ ను ఎత్తేసిన యూఏఈ..!!









