నిబంధనలు అతిక్రమిస్తే కేసులు: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి
- May 11, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుసరించి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.లాక్ డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యే ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.రాష్ట్రంలో రేపటి నుండి పది రోజులపాటు ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో అమలుపై డీజీపీ మంగళవారం రేంజ్ ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ జితేందర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ కమిషనర్లు, ఎస్పీల నుండి డీఐజీ స్థాయి సీనియర్ పోలీస్ అధికారులందరూ విధిగా క్షేత్రస్థాయిలో ఉండి లాక్డౌన్ను కఠినంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.
లాక్డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెలువరించే ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణాలపై ఏ విధమైన ఆంక్షలు లేవని తెలిపారు. జాతీయ రహదారులపై రవాణా విషయంలో కూడా ఏ విధమైన ఆంక్షలు లేవన్నారు. గ్రామాల్లో వ్యవసాయ సంబంధిత పనులు, ఉపాధిహామీ పనులను లాక్డౌన్ నుండి మినహాయించారని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వారి శాఖా పరమైన గుర్తింపు కార్డులుంటే సరిపోతుందని తెలిపారు. వివాహలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలన్నారు.
కరోనా వాక్సినేషన్కు ఎవరైనా వెళ్లాల్సివస్తే వారి మొదటి డోస్కు సంబందించిన సమాచారం సెల్ ఫోన్ లో చూసి వారికి సడలింపు ఇవ్వాలని తెలిపారు.నిత్యావసర వస్తువుల రవాణా సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.నిత్యావసర వస్తువుల రవాణా, ఇతర ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి స్థానికంగా సమయాలను పేర్కొంటూ ప్రత్యేక పాసులను జారీ చేయాలన్నారు.లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల ప్రకారం తగు కేసులు నమోదు చేయాలని పోలీస్ అధికారులకు డీజీపీ స్పష్టం చేశారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేసే వారికి ఈ- పాస్ విధానం ద్వారా సంబంధిత కమిషనర్లు, ఎస్పీలు పాసులను జారీ చేస్తారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు
- మహానాడు తొలిరోజు విజయవంతమైందన్న సీఎం చంద్రబాబు
- బక్రీద్ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
- సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి
- మెడికవర్ హైటెక్ సిటీలో అత్యాధునిక ER-SSU యూనిట్ ప్రారంభం
- రాజస్థాన్లో ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం!
- కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!









