యూఏఈ పారిశ్రామిక చట్టంలో మార్పులు..100% విదేశీ పెట్టుబడులకు అనుమతి
- May 20, 2021యూఏఈ: దేశంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా యూఏఈ తీసుకొచ్చిన పారిశ్రామిక, వాణిజ్య సంస్థ చట్ట సవరణ విధానం జూన్ 1 నుంచి అమలులోకి రానుంది. ఈ చట్ట సవరణ మేరకు విదేశీ పెట్టుబడిదారులు 100% ఇన్వెస్ట్ చేసేందుకు లైన్ క్లియర్ అవుతుంది. ఆన్ షోర్ కంపెనీ యాజమాన్య చట్టాలకు సంబంధించి గతేడాది నవంబర్ ముందు వరకు ఓ కంపెనీలో మెజారిటీ షేర్ హోల్డర్ లు యూఏఈ జాతీయులకే చెంది ఉండాలి. అయితే...విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ఈ నిబంధనను కంపెనీ యాజమాన్య చట్టం నుంచి గత నవంబర్ లో తొలగించిన విషయం తెలిసిందే. అంతేకాదు..ఓ కంపెనీలో బోర్డులో మెజారిటీ సభ్యులు యూఏఈ వారే ఉండాలని, అధ్యక్షత బాధ్యతలు కూడా యూఏఈకి చెందిన వ్యక్తులకే ఇవ్వాలనే నిబంధనను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. కంపెనీ యాజమాన్య చట్టంలో చేసిన ఈ సవరణలతో జూన్ 1 నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తామే సొంతంగా కంపెనీ పెట్టుకొని తమ యాజమాన్యంలోనే కంపెనీ నిర్వహించుకునేందుకు వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు