యూఏఈ పారిశ్రామిక చట్టంలో మార్పులు..100% విదేశీ పెట్టుబడులకు అనుమతి
- May 20, 2021
యూఏఈ: దేశంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా యూఏఈ తీసుకొచ్చిన పారిశ్రామిక, వాణిజ్య సంస్థ చట్ట సవరణ విధానం జూన్ 1 నుంచి అమలులోకి రానుంది. ఈ చట్ట సవరణ మేరకు విదేశీ పెట్టుబడిదారులు 100% ఇన్వెస్ట్ చేసేందుకు లైన్ క్లియర్ అవుతుంది. ఆన్ షోర్ కంపెనీ యాజమాన్య చట్టాలకు సంబంధించి గతేడాది నవంబర్ ముందు వరకు ఓ కంపెనీలో మెజారిటీ షేర్ హోల్డర్ లు యూఏఈ జాతీయులకే చెంది ఉండాలి. అయితే...విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ఈ నిబంధనను కంపెనీ యాజమాన్య చట్టం నుంచి గత నవంబర్ లో తొలగించిన విషయం తెలిసిందే. అంతేకాదు..ఓ కంపెనీలో బోర్డులో మెజారిటీ సభ్యులు యూఏఈ వారే ఉండాలని, అధ్యక్షత బాధ్యతలు కూడా యూఏఈకి చెందిన వ్యక్తులకే ఇవ్వాలనే నిబంధనను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. కంపెనీ యాజమాన్య చట్టంలో చేసిన ఈ సవరణలతో జూన్ 1 నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తామే సొంతంగా కంపెనీ పెట్టుకొని తమ యాజమాన్యంలోనే కంపెనీ నిర్వహించుకునేందుకు వీలు కలుగుతుంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







