వ్యాక్సినేషన్ లో టాప్ గా నిలిచిన యూఏఈ
- May 22, 2021
యూఏఈ: కోవిడ్ మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలన్ని తమ ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో కొన్ని దేశాలు వడివడిగా దూసుకెళ్తుండగా..కొన్ని దేశాల్లో మాత్రం మందకొడిగా సాగుతున్నాయి. అయితే..కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి గ్లోబల్ ర్యాకింగ్స్ లో ఇతర దేశాలతో పోలిస్తే యూఏఈ టాప్ గానిలిచింది. స్థానిక ప్రభుత్వ సమాచారం, ప్రధాన పత్రికల ద్వారా సేకరించిన వివరాలు, వరల్డ్ బ్యాంక్ పాపులేషన్ మేజర్మెంట్స్(మొత్తం జనాభాలో వ్యాక్సిన్ తీసుకున్న వారి శాతం) ఇలా పలు మార్గాల ద్వారా సేకరించిన డేటాతో ర్యాకింగ్స్ ను ఇచ్చారు. ఇందులో ఎమిరాతి ప్రథమ స్థానం దక్కించుకోగా, బహ్రెయిన్, అరుబ, చిలి టాప్ ఫైవ్ లోని చోటు దక్కించుకున్నాయి. గత డిసెంబర్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టిన యూఏఈ ఇప్పటివరకు 11.9 మిలియన్లో డోసులు ఇచ్చింది. గత శుక్రవారం ఒక్క రోజే 1,22,001 డోసుల వ్యాక్సిన్ అందించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఇప్పుడు అబుధాబిలో 12 ఏళ్లకు పైబడిన వారికి కూడా ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ ఇస్తుండటంతో వ్యాక్సినేషన్ ప్రోగ్రాం మరింత ముమ్మరం కానున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







