ఒకే ఒక్క డోసుతో అవసరమైన ఇమ్యూనిటీ లభించదు
- May 22, 2021
జెడ్డా: ఒకే ఒక్క డోసుతో తగినంత ఇమ్యూనిటీ లభించదని సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. ఖచ్చితంగా రెండో డోస్ కూడా వేసుకుని, కరోనా వైరస్ నుంచి తమను తాము రక్షించుకోవాలని సౌదీలకు హెల్త్ మినిస్ట్రీ సూచించింది. ప్రస్తుతం నాలుగు అనుమతి పొందిన వ్యాక్సిన్లు ఆస్ట్రాజెనకా, ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ మరియు మోడెర్నా అందుబాటులో వున్నాయని మినిస్ట్రీ పేర్కొంది. తొలి డోసు తర్వాత కరోనా సోకితే, రెండో డోస్ కోసం కొంత అదనపు సమయం అవసరమవుతుందని మినిస్ట్రీ వెల్లడించింది. కోలుకున్నాక ఆరు నెలల తర్వాతే వ్యాక్సినేషన్ తీసుకోవాలి. పాలిచ్చే తల్లులకు కూడా వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలూ తలెత్తవని మినిస్ట్రీ అభిప్రాయపడింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇతర వ్యాక్సిన్ల కోసం ఖచ్చితంగా 14 రోజుల గ్యాప్ పాటించాలని మినిస్ట్రీ చెబుతోంది.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







