భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఐదురోజుల అమెరికా పర్యటన..
- May 24, 2021
న్యూ ఢిల్లీ: ఐదురోజుల పాటు పర్యటన కోసం భారత విదేశాంగ మంత్రి ఎస్.కె. జైశంకర్ అమెరికా చేరుకున్నారు. ఈ పర్యటనలో, విదేశాంగ మంత్రి అమెరికన్ వ్యాక్సిన్ తయారీ దారులతో సమావేశం అవుతారు.ఫైజర్, మోడెర్నా వంటి వ్యాక్సిన్లను భారతదేశం పొందేందుకు మార్గాలను సుగమం చేసే అవకాశం ఉంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు బిడెన్ మాట్లాడుతూ అమెరికా అవసరమైన దేశాలకు కరోనా వ్యాక్సిన్ను అందిస్తుందని చెప్పారు. జైశంకర్ ఈ 5 రోజుల అమెరికా పర్యటన దీనికి అనుసంధానంగానే ఉంటుందని చెబుతున్నారు.
మే 24 నుంచి 28 వరకు భారత v విదేశాంగ మంత్రి యుఎస్ను సందర్శించనున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సమయంలో ఆయన న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ను కలిసే అవకాశం ఉంది. వాషింగ్టన్లో అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్తో కూడా జైశంకర్ సమావేశం అవుతారు. ఇండో-యుఎస్ ఆర్థిక, కోవిడ్కు సంబంధించిన అంశాలపై విదేశాంగ మంత్రి యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం (USISPF), యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) లతో చర్చలు జరపనున్నారు. ఇవే కాకుండా, ఆయన ఫార్మా కంపెనీల సీఈవోలతో సమావేశం కానున్నారు.ఈ మేరకు భారత రాయబారి టిఎస్ తిరుమూర్తి ఓ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







