భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఐదురోజుల అమెరికా పర్యటన..

- May 24, 2021 , by Maagulf
భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఐదురోజుల అమెరికా పర్యటన..

న్యూ ఢిల్లీ: ఐదురోజుల పాటు పర్యటన కోసం భారత విదేశాంగ మంత్రి ఎస్.కె. జైశంకర్ అమెరికా చేరుకున్నారు. ఈ పర్యటనలో, విదేశాంగ మంత్రి అమెరికన్ వ్యాక్సిన్ తయారీ దారులతో సమావేశం అవుతారు.ఫైజర్, మోడెర్నా వంటి వ్యాక్సిన్లను భారతదేశం పొందేందుకు మార్గాలను సుగమం చేసే అవకాశం ఉంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు బిడెన్ మాట్లాడుతూ అమెరికా అవసరమైన దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ను అందిస్తుందని చెప్పారు. జైశంకర్ ఈ 5 రోజుల అమెరికా పర్యటన దీనికి అనుసంధానంగానే ఉంటుందని చెబుతున్నారు.

మే 24 నుంచి 28 వరకు భారత v విదేశాంగ మంత్రి యుఎస్‌ను సందర్శించనున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సమయంలో ఆయన న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్‌ను కలిసే అవకాశం ఉంది. వాషింగ్టన్‌లో అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌తో కూడా జైశంకర్ సమావేశం అవుతారు. ఇండో-యుఎస్ ఆర్థిక, కోవిడ్‌కు సంబంధించిన అంశాలపై విదేశాంగ మంత్రి యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరం (USISPF), యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) లతో చర్చలు జరపనున్నారు. ఇవే కాకుండా, ఆయన ఫార్మా కంపెనీల సీఈవోలతో సమావేశం కానున్నారు.ఈ మేరకు భారత రాయబారి టిఎస్ తిరుమూర్తి ఓ ట్వీట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com