జనం గుమికూడటంపై మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ప్రకటన

- May 24, 2021 , by Maagulf
జనం గుమికూడటంపై మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ప్రకటన

మస్కట్: పెద్ద సంఖ్యలో ఒమన్ పౌరులు, నార్త్ అల్ బతినా గవర్నరేటులో గల జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ వద్ద గుమికూడటంపై మినిస్ట్రీ ఆఫ్ లేబర్ స్పందించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. మే 23న ఉదయం పెద్ద సంఖ్యలో ఒమన్ పౌరులు నార్త్ అల్ బతినా గవర్నరేటులోగల డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ వద్ద గుమికూడారనీ, తమకు ఉద్యోగావకాశాలు కల్పించాలనీ, తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారనీ, వారి డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని, సైంటిఫిక్ అలాగే ప్రాక్టికల్ డేటా పరిశీలించి, వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని మినిస్ట్రీ పేర్కొంది. వివిధ రంగాల్లో వున్న అవకాశాలకు అనుగుణంగా పౌరులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని కల్పిస్తామని మినిస్ట్రీ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com