ఏపీ కరోనా అప్డేట్

- May 27, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు త‌గ్గుతూ వ‌స్తున్నాయి.తాజా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా 84,224 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా..16,167 మందికి పాజిటివ్‌గా తేలింది.. అయితే, మ‌రోసారి మృతుల సంఖ్య వంద దాటింది.తాజాగా 104 మంది క‌రోనాతో మృతిచెందారు.చిత్తూరు:14, ప‌శ్చిమ గోదావ‌రి:13, విశాఖ‌:11, అనంత‌పూర్‌:09, నెల్లూరు:09, గుంటూరు:08, విజయనగరం:09, ప్రకాశం:07, తూర్పు గోదావరి:06, కృ ష్ణ:06, కర్నూ ల్:06, శ్రీకాకుళం:06., కడప:01 మరణించారు. మ‌రోవైపు.. గ‌త 24 గంట‌ల్లో 21,385 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీంతో.. మొత్తం పాజిటివ్ కేసులు 16,43,557కు చేర‌గా.. ప్ర‌స్తుతం 1,86,782 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇప్ప‌టి వ‌ర‌కు 14,46,244 మంది కోలుకోగా… 10,531 మంది ప్రాణాలు వ‌దిలారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com