భారతీ ఎయిర్టెల్ ఓ సరికొత్త ఆఫర్
- March 06, 2016
ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం నిత్యావసరంగా మారింది. దీంతో టెలికాం ఆపరేటర్లు కూడా ఆసక్తికరమైన ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్పెయిడ్ వినియోగదారుల కోసం టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఓ సరికొత్త ఆఫర్ను ప్రకటించింది.పోస్ట్పెయిడ్ కనెక్షన్లలో కార్పొరేట్ ప్లాన్ల్లో ఉన్నవారికి ఆయా సంస్థలు తక్కువ డేటాను అందజేస్తున్నాయి. దీంతో ఇంటర్నెట్ వాడాలనుకుంటే మరో నెంబర్ను వినియోగించాల్సి వస్తోంది. ఇకమీదట పోస్ట్పెయిడ్ వినియోగదారులు ప్రీపెయిడ్ డేటా రీఛార్జిలు చేసుకునే సదుపాయాన్ని ఎయిర్టెల్ కల్పిస్తోంది. డేటా బ్యాలెన్స్ కావాలనుకునే వినియోగదారులు.. తమకు కావాల్సిన డేటా ఆఫర్తో రీఛార్జి చేసుకొని ఇంటర్నెట్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని ఆ సంస్థ భారత్, దక్షిణాసియా డైరెక్టర్ శ్రీనివాసన్ గోపాలన్ ప్రకటించారు. ఈ రీఛార్జిలు రూ.99 నుంచి అందుబాటులో ఉండనున్నాయట.
తాజా వార్తలు
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!







