భారతీ ఎయిర్‌టెల్‌ ఓ సరికొత్త ఆఫర్‌

- March 06, 2016 , by Maagulf
భారతీ ఎయిర్‌టెల్‌ ఓ సరికొత్త ఆఫర్‌

ప్రస్తుతం ఇంటర్నెట్‌ వినియోగం నిత్యావసరంగా మారింది. దీంతో టెలికాం ఆపరేటర్లు కూడా ఆసక్తికరమైన ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారుల కోసం టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ ఓ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది.పోస్ట్‌పెయిడ్‌ కనెక్షన్లలో కార్పొరేట్‌ ప్లాన్‌ల్లో ఉన్నవారికి ఆయా సంస్థలు తక్కువ డేటాను అందజేస్తున్నాయి. దీంతో ఇంటర్నెట్‌ వాడాలనుకుంటే మరో నెంబర్‌ను వినియోగించాల్సి వస్తోంది. ఇకమీదట పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులు ప్రీపెయిడ్‌ డేటా రీఛార్జిలు చేసుకునే సదుపాయాన్ని ఎయిర్‌టెల్‌ కల్పిస్తోంది. డేటా బ్యాలెన్స్‌ కావాలనుకునే వినియోగదారులు.. తమకు కావాల్సిన డేటా ఆఫర్‌తో రీఛార్జి చేసుకొని ఇంటర్నెట్‌ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని ఆ సంస్థ భారత్‌, దక్షిణాసియా డైరెక్టర్‌ శ్రీనివాసన్‌ గోపాలన్‌ ప్రకటించారు. ఈ రీఛార్జిలు రూ.99 నుంచి అందుబాటులో ఉండనున్నాయట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com