భారతీ ఎయిర్టెల్ ఓ సరికొత్త ఆఫర్
- March 06, 2016
ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం నిత్యావసరంగా మారింది. దీంతో టెలికాం ఆపరేటర్లు కూడా ఆసక్తికరమైన ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్పెయిడ్ వినియోగదారుల కోసం టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఓ సరికొత్త ఆఫర్ను ప్రకటించింది.పోస్ట్పెయిడ్ కనెక్షన్లలో కార్పొరేట్ ప్లాన్ల్లో ఉన్నవారికి ఆయా సంస్థలు తక్కువ డేటాను అందజేస్తున్నాయి. దీంతో ఇంటర్నెట్ వాడాలనుకుంటే మరో నెంబర్ను వినియోగించాల్సి వస్తోంది. ఇకమీదట పోస్ట్పెయిడ్ వినియోగదారులు ప్రీపెయిడ్ డేటా రీఛార్జిలు చేసుకునే సదుపాయాన్ని ఎయిర్టెల్ కల్పిస్తోంది. డేటా బ్యాలెన్స్ కావాలనుకునే వినియోగదారులు.. తమకు కావాల్సిన డేటా ఆఫర్తో రీఛార్జి చేసుకొని ఇంటర్నెట్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని ఆ సంస్థ భారత్, దక్షిణాసియా డైరెక్టర్ శ్రీనివాసన్ గోపాలన్ ప్రకటించారు. ఈ రీఛార్జిలు రూ.99 నుంచి అందుబాటులో ఉండనున్నాయట.
తాజా వార్తలు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!









