హజ్ యాత్రికుల అనుమతికి లిమిట్..60,000 మందికే పర్మిషన్

- June 12, 2021 , by Maagulf
హజ్ యాత్రికుల అనుమతికి లిమిట్..60,000 మందికే పర్మిషన్

సౌదీ: కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే హజ్ యాత్రికుల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది.ఈ ఏడాది కేవలం 60 వేల మందిని మాత్రమే హజ్ ప్రార్ధనలకు అనుమతి ఇస్తున్నట్లు, ఆ మేరకే రిజిస్ట్రేషన్లు తీసుకోనున్నట్లు ఆరోగ్య, హజ్ వ్యవహారాల శాఖ మంత్రులు వెల్లడించారు. అయితే..ఈ 60 వేల రిజిస్ట్రేషన్లకు కూడా షరతులు విధించింది. హజ్ ప్రార్ధనలకు పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్న వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి. 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్కులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉండకూడదని స్పష్టం చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com