జీ7 కీలక నిర్ణయం
- June 13, 2021
లండన్: జీ 7 దేశాల సదస్సు బ్రిటన్లో జరుగుతున్నది.జీ7 సభ్యదేశాల అధినేతలు ఆ సదస్సులో పాల్గోన్న సంగి తెలిసిందే.ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న తరుణంలో ఎదుర్కొంటున్న సమస్యలపై, మహమ్మారిని తరిమికొట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సదస్సులో చర్చిస్తున్నారు.ఇక, ఇలాంటి మహమ్మారులు భవిష్యత్తులు ఎదురైతే ఎక్కువసమయం తీసుకోకుండా 100 రోజుల్లోనే మహమ్మారులకు చెక్ పెట్టేందుకు అనుగుణంగా సమర్ధవంతమైన టీకాలను అభివృద్ది చేయాలని సభ్యదేశాలు నిర్ణయం తీసుకున్నాయి.18 నెలల కాలంలో తెలుసుకున్న అనుభవాల దృష్ట్యా సభ్యదేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇక, కరోనా తొలిదశలో చైనా విషయాన్ని దాచిపెట్టడంపై జీ7 దేశాలు విరుచుకుపడ్డాయి. అయితే, చైనాను మరింత కట్టడి చేసేందుకు అమెరికా ప్రతిపాదనలు ప్రకటించగా దానికి కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు మద్దుతు తెలిపాయి.జర్మనీ, జపాన్, ఇటలీ దేశాలు తమ మద్దతును తెలపాల్సి ఉన్నది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







