"ఐయాం వెరీ సారీ" - బాలయ్య
- March 07, 2016
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం..విమర్శలు చెలరేగడంతో సారీ చెప్పడం..సెలబ్రెటీల..రాజకీయ నేతలకు అలవాటై పోయింది. తాజాగా సినీ నటుడు బాలకృష్ణ కూడా అదే బాటలో చేరిపోయారు. సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే 'సావిత్రి' ఆడియో ఫంక్షన్ కార్యక్రమంలో మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై మహిళా లోకం మండి పడింది. కన్నెర్ర చేసింది. ఓ లాయర్ ఏకంగా పీఎస్ లో ఫిర్యాదు చేశారు. బాలకృష్ణపై నిర్భయ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఒక సినీ నటుడు, ప్రజాప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, వెంటనే అతడికి శిక్ష వేయాలని మహిళా సంఘాలు నినదించాయి. వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి.
చివరకు బాలకృష్ణ స్పందించారు. తాను క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు. సినిమా వేడుకలో సరదాగా చేసిన వ్యాఖ్యలు తప్ప తాను ఎవర్నీ ఉద్ధేశించి చేసినవి కావని పేర్కొన్నారు. ఏ ఇంటి మహిళ అయినా తన ఇంటి ఆడపడుచేనన్నారు. తన వ్యాఖ్యలతో మహిళలు నొచ్చుకొని ఉంటే క్షమాపణ కోరుతున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









