"ఐయాం వెరీ సారీ" - బాలయ్య
- March 07, 2016వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం..విమర్శలు చెలరేగడంతో సారీ చెప్పడం..సెలబ్రెటీల..రాజకీయ నేతలకు అలవాటై పోయింది. తాజాగా సినీ నటుడు బాలకృష్ణ కూడా అదే బాటలో చేరిపోయారు. సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే 'సావిత్రి' ఆడియో ఫంక్షన్ కార్యక్రమంలో మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై మహిళా లోకం మండి పడింది. కన్నెర్ర చేసింది. ఓ లాయర్ ఏకంగా పీఎస్ లో ఫిర్యాదు చేశారు. బాలకృష్ణపై నిర్భయ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఒక సినీ నటుడు, ప్రజాప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, వెంటనే అతడికి శిక్ష వేయాలని మహిళా సంఘాలు నినదించాయి. వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి.
చివరకు బాలకృష్ణ స్పందించారు. తాను క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు. సినిమా వేడుకలో సరదాగా చేసిన వ్యాఖ్యలు తప్ప తాను ఎవర్నీ ఉద్ధేశించి చేసినవి కావని పేర్కొన్నారు. ఏ ఇంటి మహిళ అయినా తన ఇంటి ఆడపడుచేనన్నారు. తన వ్యాఖ్యలతో మహిళలు నొచ్చుకొని ఉంటే క్షమాపణ కోరుతున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు